ముంబయిలో ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఇంటిని నటి కమ్ ఎంపీ కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, తమ లిస్టింగ్ లో ఈ ప్రాపర్టీని కొన్ని రోజుల కిందట సేల్ కు పెట్టింది. ఇప్పుడీ ప్రాపర్టీ అమ్మకం పూర్తయింది.
ముంబయిలోని పాలీ హిల్ బంగ్లాను ఆమె 32 కోట్ల రూపాయలకు విక్రయించింది. ఈ ప్రాపర్టీని ఆమె 2017లో 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 3075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ ఇంట్లో, 565 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది.
ఈ ప్రాపర్టీ అంటే కంగనాకు చాలా ఇష్టం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, చాలా ఏళ్ల కిందటే ఆమె ఇంటీరియర్ చేయించుకుంది. అంతేకాదు, ముందు భాగాన్ని తన ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ గా కూడా మార్చుకుంది.
అయితే ఎంపీగా మారిన తర్వాత ఆ ప్రాపర్టీపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఇదే బంగ్లా కేంద్రంగా ముంబయి మహానగర పాలక సంస్థతో, కంగనా రనౌత్ కు గొడవ జరిగింది. కార్పొరేషన్ వాళ్లు సొంత భాగాన్ని కూలగొట్టారు కూడా. భవిష్యత్తులో అలాంటి వివాదాలు ఉండకుండా ప్రాపర్టీని ఆమె అమ్మేసింది.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More