జాన్వి కపూర్.. మనసు పొరల్లో అంతులేని భక్తిభావం పొంగిపొర్లుతోందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఎవరైనా నమ్మి తీరాల్సిందే.
తిరుమల శ్రీవారిపై తనకున్న అచంచలమైన భక్తిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది జాన్వి కపూర్. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంది. అంతేకాదు, తను పెళ్లంటూ చేసుకుంటే తిరుమలలోనే చేసుకుంటానని కూడా ఆమె ఇదివరకే ప్రకటించింది.
ఇప్పుడు తిరుమలపై తన ప్రేమను మరోసారి బయటపెట్టింది. ఈసారి ఇంకాస్త లోతుగా మాట్లాడింది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి తిరుపతిలోనే కాపురం పెట్టాలనే కోరికను జాన్వి కపూర్ బయటపెట్టింది.
అంతేకాదు.. ‘గోవిందా..గోవిందా’ అంటూ జపిస్తూ.. రోజూ అరిటాకుల్లో భోజనం చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చింది. తిరుపతిలోని ప్రశాంతమైన వాతావరణంలో మణిరత్నం సినిమాల్లోని పాటలు వింటూ కాలం గడపాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. జాన్వి కపూర్ కు భక్తితో పాటు, మంచి టేస్ట్ కూడా ఉందంటున్నారు నెటిజెన్లు.
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన… Read More
సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే… Read More
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక… Read More