“కుమారి 21 ఎఫ్” విడుదలైనప్పుడు ఇంత బోల్డ్ హీరోయినా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికీ, ఇప్పటికీ బోల్డ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో ఈ ‘కుమారి’దే అగ్రస్థానం. మరి ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను హీరోయిన్ హెబ్బా పటేల్ ఎలా ఒప్పుకుంది. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది హెబ్బా పటేల్.
“కుమారి 21 ఎఫ్ కథ మొత్తం నాకు చెప్పలేదు. షూటింగ్ కు వెళ్లకముందు రఫ్ ఐడియా ఇచ్చారు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత పూర్తి స్టోరీ చెప్పారు. నేను టైటిల్ రోల్ చేస్తున్నాననే విషయం కూడా సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే తెలిసింది. నేనేం ప్లాన్ చేయలేదు, ఫ్లోలో అలా జరిగిపోయింది. వాళ్లు ఏం అడిగారో అదంతా చేశాను.”
ఇలా “కుమారి 21 ఎఫ్” సినిమా వెనక జరిగిన కథను బయటపెట్టింది హెబ్బా పటేల్. పైగా ఆ సినిమా టైమ్ లో తన కెరీర్ డౌన్ ఫాల్ లో ఉందని, కాబట్టి ఆ సినిమా చేయక తప్పలేదని తెలిపింది. ప్రతి రోజూ ఫ్రెష్ మైండ్ తో సెట్స్ కు వెళ్లేదంట హెబ్బా. దర్శకుడు ఏం చెబితే దాన్ని అలా చేసి చూపించేదట. అందుకే ఆ సినిమా తనకు పెద్దగా గుర్తులేదంటోంది.
ఈమె నటించిన ‘ఓదెల-2’ త్వరలోనే థియేటర్లలోకి వస్తోంది. ‘ఓదెల’ సినిమా ఎక్కడ ముగిసిందో, “ఓదెల-2” సరిగ్గా అక్కడే మొదలౌతుందని చెబుతోంది హెబ్బా పటేల్.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More