ఇటీవల పలువురు కమెడియన్లు, టీవీ నటులు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళు ప్రచార యాత్ర చేశారు. అందులో గెటప్ శ్రీను ఒకరు.
ప్రస్తుతం “రాజు యాదవ్” అనే సినిమా ప్రచారంలో పాల్గొంటున్న గెటప్ శ్రీనుకి జనసేన ప్రచారం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై స్పందన ఏంటి అనే విషయంలో గెటప్ శ్రీను రియాక్ట్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
“నేను కానీ ఇతర నటులు కానీ మేం డబ్బు తీసుకోలేదు. మేం స్వచ్చంధంగా ప్రచారం చేశాం. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, జనసేన పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతోనే మా ప్రచారం చేశాం. డబ్బుల కోసం ప్రచారం చేశాం అనడం తప్పు,” అని గెటప్ శ్రీను అన్నాడు.
అంతే కాదు, తమని చిన్న నటులుగా జమకట్టేవాళ్లని కూడా ఛోటా లీడర్స్ అనే పిలవాల్సి ఉంటుంది అని ఘాటుగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఎవరికైనా సాయం చెయ్యడంలో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది అని శీను చెప్పాడు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, అలాగే కూటమి అధికారంలోకి వస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More