సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది. సినిమాల బడ్జెట్ బాగా పెరిగిపోయింది. హీరోల రెమ్యూనరేషన్లు చుక్కలు తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పరిశ్రమ మనుగడ ఎలా? ఇండస్ట్రీ బతికిబట్టకట్టాలంటే ఏం చేయాలి? దీనికి 2 సింపుల్ సొల్యూషన్స్ చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు.
“పెద్ద హీరోల సినిమాల బడ్జెట్స్ పెరిగిపోయాయి. ఒక్కో సినిమాకు 400-500 కోట్లు అయిపోతోంది. దీంతో ఒక సినిమాపైనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. సినిమా ఆడకపోతే చాలా డ్యామేజీ అయిపోతుంది. ఇప్పుడున్న టాప్ స్టార్స్ అంతా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఇక్కడ కరెక్షన్ జరగాలి. ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. బన్నీ ఇకపై 2 సినిమాలు చేస్తున్నాడు. ఇలా అంతా ఏడాదికి రెండేసి చేయాలి. స్టార్ హీరోల సినిమాలు 2, వాటి మధ్యలో ఓ మిడ్ రేంజ్ సినిమా.. ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా సక్సెస్ శాతం పెరుగుతుంది. ఇదొక్కటే సొల్యూషన్.”
తన దశాబ్దాల అనుభవంతో దిల్ రాజు చెప్పిన మార్గమిది. దీంతో పాటు ఆయన చెప్పిన మరో చిన్న సొల్యూషన్ కూడా ఉంది. హీరోలు నిర్మాణంలో భాగస్వాములు కావాలనేది దిల్ రాజు సూచన.
హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని ఈయన చెప్పడం లేదు. ఉన్న రెమ్యూనరేషన్ లో కొంత వైట్ లో తీసుకొని, మిగతాది ప్రొడక్షన్ లో పార్టనర్ షిప్ కింద తీసుకోమంటున్నారు. ఇలా చేస్తే నిర్మాతపై భారం తగ్గుతుందని ఇండస్ట్రీ బాగుంటుందని అంటున్నారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More