జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు ఫైల్ అవ్వడంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తుది తీర్పును సోమవారానికి వాయిదావేసింది.
మధ్యంతర బెయిల్ రాకపోవడంతో మోహన్ బాబు పరార్ అయ్యారంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆల్రెడీ అతడు పరారైనట్టు గతంలోనే వార్తలు రాగా, వాటిని మోహన్ బాబు ఖండించారు. ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
తాజాగా మరోసారి మోహన్ బాబు కనిపించడం లేదంటూ కథనాలు మొదలయ్యాయి. ఆయన దుబాయ్ కు పారిపోయారని కొంతమంది, తెలంగాణ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రాకు పారిపోయారని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.
దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే తుది తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అరెస్ట్ అవుతారా అవ్వరా అనే క్లారిటీ సోమవారం వస్తుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More