‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో అదరగొట్టాడు బాలనటుడు రేవంత్. “నిన్ను కొరికేస్తా..కొరికేస్తా నిన్ను” అంటూ సందడి చేసిన ఈ చిచ్చర పిడుగు, ఉన్నఫలంగా తెలుగుతెరపైకి ఊడిపడ్డాడు. ఇంతకీ ఈ 9 ఏళ్ల పిల్లాడికి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ప్రచారం చేశాడు ఈ బుడతడు. ఈవీఎం డమ్మీ మెషీన్ పట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ, గాజు గ్లాసు గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కాలంటూ ప్రచారం చేశాడు. జనసైనికులు విపరీతంగా షేర్ కొట్టడంతో, ఆ వీడియో ఇనస్టాగ్రామ్ లో వైరల్ అయింది.
అలా రౌండ్స్ కొడుతూ అనీల్ రావిపూడి కంట్లో పడింది. గోదావరి యాసలో ముద్దుగా మాట్లాడుతున్న రేవంత్, అనీల్ రావిపూడిని అమితంగా ఆకర్షించాడు. అప్పుడే తన సినిమాలో ఓ బుడతడి రోల్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనీల్. దీంతో ఆ పిల్లాడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
4-5 రోజుల పాటు వాళ్లనీవీళ్లని అడిగి మొత్తానికి పిల్లాడి తండ్రి ఫోన్ నంబర్ సంపాదించారు. ఊహించని విధంగా వచ్చిన సినిమా ఛాన్స్ తో కుటుంబమంతా ఉబ్బితబ్బిబ్బయింది. అలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోకి వచ్చాడు రేవంత్.
షూటింగ్ లో అతడి ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా.. “మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్లు కదలకుండా, భూమి అదరకుండా ఓ పోజెట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికే అప్పడాలు ఒడియాలు అయిపోతాయా ఏంటి?” సినిమాలో సూపర్ హిట్టయిన డైలాగ్స్ లో ఇది కూడా ఒకటి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More