దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. పెద్ద హీరోలందరూ పూరితో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపేవారు. తమని కొత్తగా చూపిస్తాడని, బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడని వారి నమ్మకం. ఐతే, క్రమంగా పూరి “ట్రాక్” తప్పారు. దాంతో భారీ ఫ్లాప్స్ వచ్చాయి. కోట్ల రూపాయల నష్టం, అప్పులు కూడా చేరాయి.
“లైగర్”తో విజయ్ దేవరకొండ స్టార్డం మొత్తాన్ని తీసిపడేసిన పూరి ఆ తర్వాత రామ్ పోతినేనికి “డబుల్ ఇస్మార్ట్”తో డబుల్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ముందుకు రావడం లేదు. దానికి కారణం… ఆయన పార్ట్నర్ ఛార్మి ఉంటే సినిమా చేయలేమని ఆ హీరోలు తేల్చి చెప్పడమే.
దాంతో, ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా ఆఫర్ల కోసం ఛార్మికి కటీఫ్ చెప్పనున్నాడని టాక్. అంటే, వాళ్లిద్దరూ విడిపోతారని కాదు. పూరి తీసే సినిమాల్లో ఛార్మి నిర్మాతగా కానీ, ఇతరత్రా కానీ ఇన్వాల్వ్ కాదు.
ఛార్మిని దూరం పెడితేనే సినిమా చేస్తామన్న హీరోలు ఇప్పుడు పూరికి వెంటనే డేట్స్ ఇస్తారా? ఛార్మి ఉన్నా లేకున్నా ప్రధానంగా పూరి చెయ్యాల్సిన పని… అర్ధవంతమైన స్రిప్ట్ రాయడం. అది ముఖ్యం. “లైగర్”, “డబుల్ ఇస్మార్ట్” లాంటి సిల్లీ కథలు, సన్నివేశాలతో ఎవరూ హిట్ కొట్టలేరు.
మరోవైపు, ఛార్మి తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల జిమ్ లో చేరినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చెయ్యడం విశేషం.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More