దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. పెద్ద హీరోలందరూ పూరితో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపేవారు. తమని కొత్తగా చూపిస్తాడని, బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడని వారి నమ్మకం. ఐతే, క్రమంగా పూరి “ట్రాక్” తప్పారు. దాంతో భారీ ఫ్లాప్స్ వచ్చాయి. కోట్ల రూపాయల నష్టం, అప్పులు కూడా చేరాయి.
“లైగర్”తో విజయ్ దేవరకొండ స్టార్డం మొత్తాన్ని తీసిపడేసిన పూరి ఆ తర్వాత రామ్ పోతినేనికి “డబుల్ ఇస్మార్ట్”తో డబుల్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ముందుకు రావడం లేదు. దానికి కారణం… ఆయన పార్ట్నర్ ఛార్మి ఉంటే సినిమా చేయలేమని ఆ హీరోలు తేల్చి చెప్పడమే.
దాంతో, ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా ఆఫర్ల కోసం ఛార్మికి కటీఫ్ చెప్పనున్నాడని టాక్. అంటే, వాళ్లిద్దరూ విడిపోతారని కాదు. పూరి తీసే సినిమాల్లో ఛార్మి నిర్మాతగా కానీ, ఇతరత్రా కానీ ఇన్వాల్వ్ కాదు.
ఛార్మిని దూరం పెడితేనే సినిమా చేస్తామన్న హీరోలు ఇప్పుడు పూరికి వెంటనే డేట్స్ ఇస్తారా? ఛార్మి ఉన్నా లేకున్నా ప్రధానంగా పూరి చెయ్యాల్సిన పని… అర్ధవంతమైన స్రిప్ట్ రాయడం. అది ముఖ్యం. “లైగర్”, “డబుల్ ఇస్మార్ట్” లాంటి సిల్లీ కథలు, సన్నివేశాలతో ఎవరూ హిట్ కొట్టలేరు.
మరోవైపు, ఛార్మి తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల జిమ్ లో చేరినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చెయ్యడం విశేషం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More