“భైరవం” అనే సినిమా రానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. మొన్నటివరకు జనం ఈ సినిమాని పక్కా తెలుగు సినిమా అనుకున్నారు. కానీ టీజర్ వచ్చాక ఇది రీమేక్ అని అర్థమైంది.
తమిళ్ లో గతేడాది విడుదలైన చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి… గరుడన్. కమెడియన్ సూరి హీరోగా మారిన తర్వాత నటించిన రెండో చిత్రం. సూరికి మిత్రులుగా శశికుమార్, ఉన్ని ముకుందన్ నటించారు. ఒక ఊరిలో జరిగే కథ. ముగ్గురు మిత్రుల చుట్టూ తిరిగే ఈ సినిమాలో సూరి అనాధగా నటించారు. ఇతర ఇద్దరు మిత్రులు అతన్ని చేరదీసి తమవాడిగా చేసుకుంటారు. దాంతో ఆ మిత్రుల కోసం ఎంతకైనా తెగించే వాడిగా సూరి మారుతాడు.
“భైరవం” కథ ఇదే అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. సూరి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ పాత్రలని మంచు మనోజ్, నారా రోహిత్ చేస్తున్నారు. వడివుక్కరసి నటించిన బామ్మ పాత్రని ఇక్కడ జయసుధ పోషిస్తున్నారు.
“నాంది”, “ఉగ్రం” వంటి సినిమాలు తీసిన విజయ్ కుమార్ కనకమేడల ఇప్పుడు విజయం కోసం రీమేక్ ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన… Read More
సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే… Read More
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక… Read More