కోట్లాది మంది వచ్చే కుంభమేళాకు సెలబ్రిటీలు వెళ్లడం దాదాపు అసాధ్యం. ఆ జనం మధ్య నుంచి వాళ్లను తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడం, భద్రతా వ్యవహారాలు చూసుకోవడం కష్టమైన విషయం. అలాంటి కుంభమేళాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.
నమ్మబుద్ధి కావడం లేదు కదా. నిజమే, నమ్మాల్సిన అవసరం లేదు. చరణ్, బన్నీ ఎక్కడికీ వెళ్లలేదు. ఒకవేళ వాళ్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు పనిపెట్టారు కొంతమంది. అలా రూపుదిద్దుకున్నవే ఈ ఫొటోలు.
ఇలా ఏఐ సహాయంలో వివిధ సందర్భాల్ని రీ-క్రియేట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మొన్నటికిమొన్న సైఫ్ హాస్పిటల్ బెడ్ పై ఎలా ఉండొచ్చు అనే ఆలోచనకు ఏఐతో ఓ రూపునిచ్చారు.
అంతకంటే ముందు.. టాలీవుడ్ హీరోలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందంటూ, ఆ గెటప్స్ తో మన హీరోలు ఫొటోల్ని ఏఐ చేశారు. మొన్నటివరకు హీరోల ఫొటోల్ని మార్ఫింగ్ చేయడానికి మాత్రమే ఏఐని ఉపయోగించిన కొంతమంది, ఇప్పుడిలా తమ క్రియేటివిటీకి పని పెడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల ఫస్ట్ లుక్స్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. అవి ఒరిజినల్ ఫస్ట్ లుక్స్ కావు.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More