‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. సినిమాలో వెంకటేష్ కు భార్యగా నటించింది ఐశ్వర్య
ఈ పాత్ర కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు అనుకున్నాడట అనీల్ రావిపూడి. వాళ్లలో ఫైనల్ గా నిత్యామీనన్ ను, ఐశ్వర్య రాజేశ్ ను ఫైనల్ చేశారట. నిత్యామీనన్ అందుబాటులో లేకపోవడంతో, ఆ పాత్రకు ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారట.
ఆ పాత్రను ఐశ్వర్య రాజేష్ అంగీకరించడం చాలా గ్రేట్ అంటున్నాడు రావిపూడి. ఎందుకంటే, ఈ సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా కనిపిస్తుందంట ఐశ్వర్య. నెరేషన్ లో ఈ విషయం ఆమెకు చెప్పినప్పటికీ.. క్యారెక్టర్ బలంగా ఉండడంతో నటించడానికి ఐశ్వర్య రాజేష్ అంగీకరించిందంటున్నాడు.
‘గోదారి గట్టు’ పాటలో వెంకీ-ఐశ్వర్య కాంబినేషన్ ను చూసిన జనం.. వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ తో పోలుస్తున్నారని.. ఆ సాంగ్ హిట్టవ్వడం తన సినిమాకు ప్లస్ అయిందంటున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More