హీరో రామ్ కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది అని అంటున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తీసిన పి.మహేష్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్, ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.
అయితే “డబుల్ ఇస్మార్ట్” తర్వాత రామ్ నుంచి వచ్చే సినిమా ఏంటనేది ఇప్పుడు అందర్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, తాజాగా ప్రారంభించిన సినిమాతో పాటు, అతడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది తేలాల్సి ఉంది.
రవితేజతో “మిస్టర్ బచ్చన్” సినిమా చేస్తున్నాడు హరీశ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడు పవన్ తో ప్రారంభించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను కంటిన్యూ చేయాల్సి ఉంది. పవన్ వెంటనే అందుబాటులోకి వస్తే “ఉస్తాద్” మొదలవుతుంది. లేట్ అయితే మాత్రం రామ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More