తెలుగు వారు మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇక భోజన మర్యాదలతో అతిథులను ఆనందపరచడంలో గోదావరి ప్రాంతం వారు ప్రసిద్ధి. అలాంటి వారు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. హీరోల్లో మొదట వినిపించే పేరు ప్రభాస్. ఆయన తన సినిమా షూటింగ్ లొకేషన్లో హీరోయిన్లకు, ఇతరులకు వడ్డించేందుకు ప్రత్యేకంగా తన ఇంట్లో చెఫ్స్ ని పెట్టుకున్నారు. వారు తయారు చేసిన భోజనం ప్రతిరోజూ వడ్డిస్తారు సెట్లో.
తాజాగా ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తున్నారు. ఇటీవల జాన్వి కపూర్ ఎన్టీఆర్ మర్యాదల గురించి రాసింది. ఎన్టీఆర్ పంపించిన భోజనాల స్ప్రెడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో చూపించింది. తాజాగా చిరంజీవి ఆతిథ్య మర్యాదలు ఎలా ఉంటాయో తెలిపింది త్రిష.
మెగాస్టార్ సరసన ఆమె “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం త్రిషకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ఆమె కోసం మెగాస్టార్ ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారు. భోజనంతో తనని మెగాస్టార్ చంపేస్తున్నారు అంటూ ఆనందంగా పోస్ట్ చేసింది.
“ప్రతిరోజూ మెగాస్టార్ చిరంజీవి భోజన మర్యాదల వల్ల చెడిపోతున్నా” (Being spoilt rotten every day by the megastar (Sic)” అని రాసుకొంది. ఆ వంటకాలు అన్ని ఆరగించి తన ఫిట్నెస్ ని చెడగొట్టుకోవాల్సి వస్తుంది అనే అర్థంలో రాసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More