హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని ఆమె ప్రకటించింది. దీన్నే టెక్నికల్ గా డిజిటల్ డిటాక్స్ అని అంటారు.
మొన్ననే శృతిహాసన్ తన ఎకౌంట్ ను కోల్పోయింది. కొంతమంది హాకర్లు, ఆమె సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారు. క్రిప్టో కరెన్సీకి చెందిన యాడ్స్ పెట్టుకున్నారు. అతి కష్టమ్మీద తన ఎకౌంట్ ను తిరిగి దక్కించుకుంది శృతిహాసన్.
అలా ఎకౌంట్ ను తిరిగి పొందిన కొన్ని రోజులకే ఆమె డిజిటల్ డిటాక్స్ ను ప్రకటించడం విశేషం. శృతిహాసన్ ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
మరికొంతమంది మాత్రం ఆమె ‘కూలి’ సినిమా ప్రచారం కోసం ఫ్రెష్ గా జనం ముందుకొచ్చేందుకు ఇలా సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చినట్టు చెబుతున్నారు. నిత్యం ఇనస్టాగ్రామ్ లో ఏదో ఒక పోస్టు పెట్టే శృతిహాసన్, సోషల్ మీడియాకు ఎన్ని రోజులు దూరంగా ఉండగలదో చూద్దాం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More