సాయి పల్లవి గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. పూర్తిగా రెస్ట్ తీసుకొంది. కానీ ఈ ఏడాది (2024)లో మాత్రం ఆమె రెస్ట్ దొరకడం లేదు. అంతగా బిజీ అయింది.
2022లో “విరాట పర్వం” విడుదల తర్వాత బ్రేక్ తీసుకొంది. గతేడాది చివర్లో కొత్త సినిమాలు సైన్ చెయ్యడం మొదలు పెట్టింది. ప్రస్తుతం మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందుకే ఆమె ఊపిరి సలపనంత బిజీగా ఉంది.
తెలుగులో ఆమె నాగ చైతన్య సరసన “తండేల్” అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విశాఖ పట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా చాలా భాగం మిగిలే ఉంది. డిసెంబర్ లో విడుదలయ్యే “తండేల్” కోసం ఆమె కష్టపడుతోంది.
ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ రెండో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇప్పుడు రణబీర్ కపూర్ సరసన “రామాయణ”లో సీతగా నటిస్తోంది. ఈ రెండు హిందీ సినిమాలు కూడా వచ్చే ఈఏడాది విడుదల అవుతాయి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More