‘లైగర్’ లాంటి డిజాస్టర్.. ఆ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ రూపంలో మరో పెద్ద ఫ్లాప్. దీనికితోడు ‘లైగర్’తో కొన్ని ఆర్థిక వివాదాలు కూడా తలెత్తాయి. ఇలా వరుసపెట్టి అన్నీ ప్రతికూల ఘటనలే జరగడంతో పూరి జగన్నాధ్, ఛార్మి అనుబంధంపై చాలామందికి అనుమానాలు పెరిగాయి.
ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన ఈ జంట, ఇకపై ఎవరి దారి వారు చూసుకున్నారనే ప్రచారం నడిచింది. దీనికి మరింత ఊతమిస్తూ, పూరి జగన్నాధ్ ఒక్కడే స్వయంగా కొంతమంది నిర్మాతలతో టచ్ లోకి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఇలా ఒకటి, రెండు కాదు… ఈ మధ్య పూరి-చార్మి బంధంపై చాలా గాసిప్స్ వచ్చాయి.
ఎట్టకేలకు ఈ పుకార్లన్నింటికీ తమదైన స్టయిల్ లో చెక్ పెట్టింది ఈ జంట. విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటోను ఈరోజు రిలీజ్ చేసింది ఈ జంట. తమ తదుపరి చిత్రాన్ని ఈ హీరోతోనే చేయబోతున్నట్టు వాళ్లు ప్రకటించారు.
ALSO READ: Puri Jagannadh to direct Vijay Sethupathi in a new film
ఈ ఒక్క ఫొటోతో ఇన్నాళ్లూ నడిచిన పుకార్లకు తెరపడింది. పూరి-చార్మి కాంబినేషన్ ఎప్పట్లానే కలిసి పనిచేయబోతోంది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, ఇంకెన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ బంధాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరని ఈ ఒక్క ఫొటోతో పరోక్షంగా వెల్లడించింది ఈ జంట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More