‘లైగర్’ లాంటి డిజాస్టర్.. ఆ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ రూపంలో మరో పెద్ద ఫ్లాప్. దీనికితోడు ‘లైగర్’తో కొన్ని ఆర్థిక వివాదాలు కూడా తలెత్తాయి. ఇలా వరుసపెట్టి అన్నీ ప్రతికూల ఘటనలే జరగడంతో పూరి జగన్నాధ్, ఛార్మి అనుబంధంపై చాలామందికి అనుమానాలు పెరిగాయి.
ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన ఈ జంట, ఇకపై ఎవరి దారి వారు చూసుకున్నారనే ప్రచారం నడిచింది. దీనికి మరింత ఊతమిస్తూ, పూరి జగన్నాధ్ ఒక్కడే స్వయంగా కొంతమంది నిర్మాతలతో టచ్ లోకి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఇలా ఒకటి, రెండు కాదు… ఈ మధ్య పూరి-చార్మి బంధంపై చాలా గాసిప్స్ వచ్చాయి.
ఎట్టకేలకు ఈ పుకార్లన్నింటికీ తమదైన స్టయిల్ లో చెక్ పెట్టింది ఈ జంట. విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటోను ఈరోజు రిలీజ్ చేసింది ఈ జంట. తమ తదుపరి చిత్రాన్ని ఈ హీరోతోనే చేయబోతున్నట్టు వాళ్లు ప్రకటించారు.
ALSO READ: Puri Jagannadh to direct Vijay Sethupathi in a new film
ఈ ఒక్క ఫొటోతో ఇన్నాళ్లూ నడిచిన పుకార్లకు తెరపడింది. పూరి-చార్మి కాంబినేషన్ ఎప్పట్లానే కలిసి పనిచేయబోతోంది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, ఇంకెన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ బంధాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరని ఈ ఒక్క ఫొటోతో పరోక్షంగా వెల్లడించింది ఈ జంట.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More