వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు నితిన్. ఓవైపు అలా ఫ్లాపులొస్తున్నాయి. మరోవైపు ‘తమ్ముడు’ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయలేదు. “అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి” అంటూ దిల్ రాజుకు కబురు పెట్టాడు.
మొత్తానికి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు నితిన్. సినిమా హిట్టయితే అతడికి మరికొంత ముట్టేది. కానీ డిజాస్టర్ అవ్వడంతో, నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది.
ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదంట. తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు నితిన్. దాని పేరు ‘ఎల్లమ్మ’. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్.
‘తమ్ముడు’ సినిమాకు విడుదలకు ముందు పాక్షికంగా పేమెంట్ తీసుకున్న ఈ హీరో, ‘ఎల్లమ్మ’ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని, లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశాడట. ప్రస్తుతానికి ఇది పుకారే అయినప్పటికీ, నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, నితిన్ కు ఇప్పుడు పారితోషికం కంటే సక్సెస్ అవసరం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More