సంతోషంతో కూడిన డైలమా ఇది. ఓవైపు నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక. మరోవైపు ఆమె హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె నిర్మాతగా కొనసాగాలా లేక హీరోయిన్ గా తిరిగి కెరీర్ మొదలుపెట్టాలా అనే డైలమాలో పడింది.
నిర్మాతగా మారి తొలిసారి “కమిటీ కుర్రోళ్లు” సినిమాను నిర్మించింది నిహారిక. ఈ సినిమాకు అన్నీ తానై ప్రచారం చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు స్టార్ ఎట్రాక్షన్ నిహారిక మాత్రమే. అందుకే బాగా కష్టపడింది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది. “కమిటీ కుర్రోళ్లు” మంచి విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలకు ముందే ఆమె హీరోయిన్ గా కెరీర్ ను రీస్టార్ట్ చేసింది. ఆల్రెడీ మంచు మనోజ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకు సైన్ చేసింది.
“కమిటీ కుర్రోళ్లు” సక్సెస్ తో నిహారిక ఇప్పుడు డైలమాలో పడినట్లే అనే మాట వినిపిస్తోంది.
హీరోయిన్ గా కొనసాగాలా, లేక నిర్మాతగా మరో సినిమా నిర్మించాలా అని ఆలోచిస్తోంది. రెండూ చేయొచ్చు కదా అనే అనుమానం రావొచ్చు. కానీ ఈరోజుల్లో రెండూ నిర్వహించడం చాలా కష్టమైన పని. ఒక చోట నిర్మాతగా డబ్బులు పెట్టి, మరో చోటుకు వెళ్లి హీరోయిన్ గా నటించడం అనేది చాలా ఇబ్బందికరం. ఐతే, ఇప్పుడు కెరీర్ పైనే దృష్టి నిలిపింది. డివోర్స్ తీసుకున్నాక ఆమె పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది కొంచెం కష్టం అయినా అటు నిర్మాతగానూ , ఇటు హీరోయిన్ గానూ కొనసాగుతుంది అని చెప్పొచ్చు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More