నిధి అగర్వాల్ చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడు ఆమె ఖాతాలో పడినవి కాదు. ఒకటేమో కరోనాకి ముందు వచ్చింది. ఇంకోటి రెండేళ్ల క్రితం దక్కింది. కానీ అవి ఇంకా పూర్తి కాలేదు. ఈ భామ ఆ రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకొని కూర్చొంది.
ఆ చిత్రాలు: 1) హరి హర వీర మల్లు 2) ది రాజా సాబ్.
‘హరి హర వీర మల్లు’ చిత్రం దాదాపు మూడున్నరేళ్లుగా నిర్మాణంలో ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తీస్తున్న భారీ చిత్రం ఇది. ఈ సినిమాని నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పై సీన్లతో మొదలు పెట్టారు. కానీ మధ్యలో పవన్ ఈ సినిమాని పక్కన పెట్టి “భీమ్లా నాయక్”, “బ్రో” సినిమాలు పూర్తి చెయ్యడంతో క్రిష్ ఈ గ్యాప్ లో “కొండపొలం” అనే సినిమా తీసి వదిలాడు. ఇప్పుడు అనుష్క హీరోయిన్ గా ‘గాటి’ అనే సినిమా తీస్తున్నాడు.
‘హరి హర వీర మల్లు’ పూర్తి అయి విడుదల కావాలంటే 2025 దాకా వెయిట్ చెయ్యాలి.
మరోవైపు ప్రభాస్ హీరోగా “ది రాజా సాబ్” అనే సినిమా కూడా అలా అలా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి మెయిన్ హీరోయిన్. మరో భామ మాళవిక మోహనన్. తాజాగా ప్రభాస్ మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. దాంతో, నిధి ఈ రోజు నుంచి షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో, ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడే చెప్పలేం.
ఐతే, నిధి ఈ రెండు సినిమాల కోసం మరో ఏడాది ఆగాలి. ‘హరి హర వీర మల్లు’ సంగతేమో గాని ‘ది రాజాసాబ్’ వచ్చే సంక్రాంతి లోపు విడుదల అవుతుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More