ఒకప్పుడు మోహన్ బాబు అంటే అందరికీ హడల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా భయపడేది…. ఆయన మాటకి, ఆయన చేష్టలకి. ఇప్పుడు మోహన్ బాబు తన కొడుకులకే భయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలను కూడా గద్దించేవారు. ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమో అని ఆయనే భయపడుతున్నారు.
కాలం, వయసు అన్నింటిని తలకిందులు చేశాయి. అంతకన్నా ముఖ్యంగా సన్ స్ట్రోక్ బాగా తగిలింది మోహన్ బాబుకు. అందుకే ఇప్పుడు పూర్తిగా వేదాంతం పలుకుతున్నారు.
మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తన కుటుంబ గొడవల ప్రస్తావన తేకుండా ఒక మాట చెప్పారు. “అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తుండేవారు… పిల్లలను కనగలం కానీ వారి తలరాతలను కనలేం అనేవారు. ఆ మాట ఇప్పుడు నిజం అనిపిస్తోంది.” ఇది మోహన్ బాబు పలుకు. చిన్న కొడుకు మనోజ్ చేసిన గొడవ, పెద్ద కొడుకు విష్ణు పట్టింపులతో మోహన్ బాబుకి వేదాంతం వచ్చేసింది.
ఇక ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరినీ నిందించను అని ముగించారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More