పెళ్లి తర్వాత హీరోహీరోయిన్లు కాస్త గ్యాప్ తీసుకోవడం సహజం. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నటీనటులెవ్వరూ గ్యాప్ తీసుకోవడం లేదు. ఇలా పెళ్లి చేసుకొని, ఏం జరగనట్టు అలా సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. కీర్తి సురేష్ అయితే ఏకంగా మెడతో తాళిబొట్టుతో సినిమా ఫంక్షన్లకు వచ్చేసింది.
అలా పెళ్లి తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వని ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత జోరు చూపిస్తోంది.
పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో అశోక్ సెల్వన్ సరసన ఓ సినిమా చేయబోతోంది కీర్తి సురేష్.
ఆమె నటించిన చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే అవన్నీ ఒక్కొక్కటిగా మార్కెట్లోకి రాబోతున్నాయి. ఓవైపు ఆ పనులు జరుగుతుండగా, మరోవైపు ఇలా కొత్త సినిమాలకు సైన్ చేస్తూ తన జోరు చూపిస్తోంది కీర్తి.
అయితే తెలుగులో మాత్రం ఆమె స్ట్రయిట్ సినిమాలో కనిపించి చాన్నాళ్లయింది. ‘భోళాశంకర్’ తర్వాత మళ్లీ ఆమె తెలుగుతెరపై కనిపించలేదు. ‘కల్కి’ సినిమాలో చిట్టి పాత్రలో తన గొంతు మాత్రం వినిపించింది. 32 ఏళ్ల ఈ నటి త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్ తో మనల్ని అలరించనుంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More