తను నూటికి నూరుపాళ్లు సాధారణ పౌరుడ్ని అంటున్నాడు అల్లు అర్జున్. తనకు ఎలాంటి భేషజాలు ఉండవని, మనసులో స్టార్ డమ్ లాంటి ఫీలింగ్స్ పెట్టుకోనని అన్నాడు. సింపుల్ గా, నిస్వార్థంగా ఉండడం తన మనసులో పుట్టుక నుంచి ఉందని, దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరని అంటున్నాడు.
‘ది హాలీవుడ్ రిపోర్టర్’ అనే అంతర్జాతీయ పత్రిక ఇండియన్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాల్ని చెప్పుకొచ్చాడు బన్నీ. అతడు నటించిన ‘పుష్ప-2’ సినిమా ఆల్ ఇండియా హిట్టయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1871 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
తన సినిమా ఇంత ఘనత సాధించినప్పటికీ, తనకు ఎలాంటి ఇగోస్ ఉండవని ప్రకటించాడు అల్లు అర్జున్. ఓ సినిమా చూసినప్పుడు సాధారణ పౌరుడిగానే చూస్తానని, ఇక షూటింగ్స్ లేనప్పుడు అంతకంటే సింపుల్ గా ఉంటానని అన్నాడు. షూటింగ్స్ లేని టైమ్ లో ఏమీ చేయనని, కనీసం పుస్తకం కూడా చదవనని తెలిపిన బన్నీ… ఏం చేయకుండా ఉండడమే తనకిష్టమని ప్రకటించాడు.
త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నాడు. వీటిలో ఏ సినిమా ముందుగా ప్రారంభం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More