దిశా పటాని గతేడాది (2024) మూడు సినిమాల్లో కనిపించింది. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి. హిందీలో నటించిన “యోధ” ఫ్లాప్ అయింది. తమిళంలో చేసిన “కంగువ” ఘోరాతిఘోరమైన పరాజయం పాలైంది. ఆమె పాత్ర విషయంలో మరింత ట్రోలింగ్ జరిగింది.
ఆడిన ఏకైక చిత్రం… కల్కి 2898 AD. ఇక ఈ ఏడాది నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం… ‘వెల్కమ్’ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న “వెల్కమ్ టు ది జంగిల్” (Welcome To The Jungle).
2024లో మూడు సినిమాల్లో కనిపించిన ఈ భామ ఇప్పటివరకు ఈ ఏడాది కొత్తగా ఒక్క సినిమా సైన్ చెయ్యలేదు. గతేడాది ఒప్పుకున్న “వెల్కమ్ టు ది జంగిల్” సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉంది.
దిశాకి ఆఫర్లు రాకపోవడానికి కారణం… ఆమె ఇప్పటివరకు తన క్రేజ్ వల్ల సినిమాకి లాభం జరిగినట్లు చూపకపోవడమే. ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 61 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉన్నా… సినిమాల విషయానికి వస్తే పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.
అందుకే, ఆమె సినిమా షూటింగ్ ల కన్నా ఇన్ స్టాగ్రామ్ కోసం ఫోటోషూట్లు చేసుకుంటూ ఎక్కువ బిజీగా ఉంది. ఈ ఇన్ స్టాగ్రామ్ వల్లే ఆమెకి బ్రాండ్స్ వస్తున్నాయి. ఆదాయం వస్తోంది.
ఇక “కల్కి” రెండో భాగంలో కూడా ఈమె నటించనుంది. ఐతే, అది ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. సో, ఈ గ్యాప్ లో ఇలాగే ఫోటోషూట్లు చేస్తూ గడిపేస్తుంది కాబోలు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More