ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయ చాలా కాలమే అయింది. 18 ఏళ్ల కాపురం తర్వాత వీరు 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు నుంచి వీరికి పిలుపు వచ్చింది.
అక్టోబర్ 7న కోర్టు ముందు ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరూ తమ అభీష్టం మేరకు విడాకులు తీసుకుంటున్నామని, ఇందులో ఎవరూ ఒత్తిడి లేదని, ఇక కలిసి ఉండే పరిస్థితి లేదని న్యాయమూర్తికి చెప్పితేనే విడాకులు వస్తాయి. సాధారణంగా న్యాయమూర్తులు మరోసారి ఆలోచించుకోమని సలహా ఇస్తారు విడాకులు కోరుకునే జంటకు. కొంత టైం కూడా ఇస్తారు. ఐతే, వీరిని అక్టోబర్ 7న రమ్మని చెప్పారంటే ఇంకా టైం ఇవ్వకపోవచ్చు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.
ధనుష్ త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రంలో నటిస్తున్నాడు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More