ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయ చాలా కాలమే అయింది. 18 ఏళ్ల కాపురం తర్వాత వీరు 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు నుంచి వీరికి పిలుపు వచ్చింది.
అక్టోబర్ 7న కోర్టు ముందు ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరూ తమ అభీష్టం మేరకు విడాకులు తీసుకుంటున్నామని, ఇందులో ఎవరూ ఒత్తిడి లేదని, ఇక కలిసి ఉండే పరిస్థితి లేదని న్యాయమూర్తికి చెప్పితేనే విడాకులు వస్తాయి. సాధారణంగా న్యాయమూర్తులు మరోసారి ఆలోచించుకోమని సలహా ఇస్తారు విడాకులు కోరుకునే జంటకు. కొంత టైం కూడా ఇస్తారు. ఐతే, వీరిని అక్టోబర్ 7న రమ్మని చెప్పారంటే ఇంకా టైం ఇవ్వకపోవచ్చు.
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.
ధనుష్ త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రంలో నటిస్తున్నాడు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More