ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. 2022లో తాము ఇద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. అయితే,కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రయత్నించిన మాట వాస్తవం.
కానీ రజినీకాంత్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తలుగా బతకలేరని అర్థమైందట. ఇటు ధనుష్, అటు ఐశ్వర్య కూడా వారి వారి జీవితాల్లో మూవ్ ఆన్ అయిపోయారు. ధనుష్ హీరోగా బిజీ అవగా, ఆమె డైరెక్టర్ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తమ ఇద్దరి కొడుకులను ఇద్దరూ చూసుకుంటున్నారు.
ఇకపై కూడా పిల్లలకు సంబంధించి ఇద్దరూ బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నారట. ఐతే ఇక ఇప్పుడు లీగల్ గా విడిపోవాలని కోర్టులు విడాకులకు పిటిషన్ దాఖలు చేసినట్లు చెన్నై మీడియా కథనం.
పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడిపోబోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని కూడా డిసైడ్ అయ్యారట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More