హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు కొన్ని ట్వీట్లు చేశారు. అందులో ప్రధానమైనది మావాడు, పరాయి వాడు అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే… మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” ఇది ఆయన ట్వీట్.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు హ్యాండ్ ఇచ్చిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గురించి ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని కొందరు అంచనా వేశారు. ఐతే, కొందరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి వేశారెమో అని సందేహం వ్యక్తం చెయ్యడం విశేషం. ఎందుకంటే, పోలింగ్ కి రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి అక్కడి వైస్సార్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అక్కడ వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రవి చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు, అందుకే అతనికి మద్దతు తెలిపాను అని అల్లు అర్జున్ ప్రకటించారు. పార్టీకి కాకుండా మిత్రుడికి మాత్రమే మద్దతు చెప్పాను అన్నారు.
ఐతే, నాగబాబు బహుశా అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా ట్వీట్ చేసి ఉంటారని చాలా మంది డౌట్. కానీ మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన వారు ఎవరూ నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టి ఉండరని ఈజీగా చెప్పగలరు.
సో, ఈ పోస్ట్ తమ ఫ్యామిలీ హీరో కోసం కాదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More