హోరాహోరీగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు కొన్ని ట్వీట్లు చేశారు. అందులో ప్రధానమైనది మావాడు, పరాయి వాడు అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే… మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” ఇది ఆయన ట్వీట్.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు హ్యాండ్ ఇచ్చిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గురించి ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని కొందరు అంచనా వేశారు. ఐతే, కొందరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి వేశారెమో అని సందేహం వ్యక్తం చెయ్యడం విశేషం. ఎందుకంటే, పోలింగ్ కి రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి అక్కడి వైస్సార్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అక్కడ వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రవి చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు, అందుకే అతనికి మద్దతు తెలిపాను అని అల్లు అర్జున్ ప్రకటించారు. పార్టీకి కాకుండా మిత్రుడికి మాత్రమే మద్దతు చెప్పాను అన్నారు.
ఐతే, నాగబాబు బహుశా అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా ట్వీట్ చేసి ఉంటారని చాలా మంది డౌట్. కానీ మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన వారు ఎవరూ నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టి ఉండరని ఈజీగా చెప్పగలరు.
సో, ఈ పోస్ట్ తమ ఫ్యామిలీ హీరో కోసం కాదు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More