పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కూటమి అభ్యర్థుల కోసం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో పలువురు సినిమా సెలెబ్రిటీలు ప్రచారం మొదలుపెట్టారు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా జాయిన్ అవుతున్నాడు. వరుణ్ తేజ్ శనివారం (ఏప్రిల్ 27) పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటాడు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం “మట్కా” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కి గ్యాప్ దొరికింది. దాంతో తనవంతుగా జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు వరుణ్ తేజ్ అడుగు ముందుకేశాడు. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఈ సారి ఎన్నికల బరిలో లేరు కానీ జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఆయనది చురుకైన పాత్ర.
ఇక వరుణ్ తేజ్ తో పాటు మిగతా మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు బయటికి రాకపోవచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎదో ఒక రోజు ప్రచారం చేస్తారు అనే మాట వినిపిస్తోంది.
జనసేన – తెలుగు దేశం పార్టీ – భారతీయ జనతా పార్టీ కలిసి ఈ సారి పోటీ చేస్తున్నాయి.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More