కుంభమేళాలో తీసిన ఫొటోలతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్ కు చెందిన పూసలు అమ్ముకునే ఈ అమ్మాయి కళ్లు చూసి పడిపోయాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. ఖర్గోన్ జిల్లాలో మహేశ్వర్ అనే ఊరిలో ఉన్న మోనాలిసా ఇంటికెళ్లి మరీ ఆమెతో అక్కడికక్కడే అగ్రిమెంట్ రాయించుకొని అడ్వాన్స్ ఇచ్చాడు.
తను తీయబోయే ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో మోనాలిసాను హీరోయిన్ గా తీసుకున్నాడు సనోజ్ మిశ్రా. ఆమెను ముంబయి తీసుకొచ్చి ఓ ఫ్లాట్ లో ఉంచాడు. రకరకాల మేకప్ లు వేసి, దుస్తులు తొడిగించి ఫొటోషూట్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యే తనను ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు కూడా తీసుకెళ్లాడు.
ఇంతకీ ఈ సినిమా కోసం మోనాలిసాకు ఎంత ఎమౌంట్ ఇస్తున్నాడు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో నటించడానికి ఆమెకు 21 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు వెల్లడించాడు మిశ్రా. అమ్మాయి కొత్త కాబట్టి, ఆమెకు ట్రయినింగ్ ఇచ్చే బాధ్యతతో పాటు భోజనం-వసతి లాంటి సౌకర్యాల్ని కూడా తనే చూసుకుంటున్నట్టు వెల్లడించాడు.
అలా తొలి సినిమాకే 21 లక్షల రూపాయల పారితోషికం అందుకుంటోంది మోనాలిసా. అన్నట్టు ఇప్పుడీ ప్రాజెక్టుపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా ఓపెనింగ్ కూడా అవ్వకముందే ఆగిపోయేలా ఉందని జితేంద్ర అనే నిర్మాత విమర్శలు చేస్తున్నాడు.
సనోజ్ ఓ తాగుబోతని, సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిల్ని ముంబయికి తీసుకొచ్చి వాడుకోవడం అతడికి అలవాటని ఆరోపిస్తున్నాడు జితేంద్ర. అతడిది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని, మోనాలిసా క్రేజ్ ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్నాడని, సినిమా మాత్రం రాదని అంటున్నాడు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More