నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ఆసక్తికర ప్రకటన చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని తను గతంలోనే చెప్పానని, ఇప్పుడు అందులో సగం నెరవేరిందని అన్నాడు.
“దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరూ ‘భారతీయుడే’. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ సీఎం నా ఫ్రెండ్ అని ఒక రోజు గర్వంగా చెప్పుకుంటానని మూడేళ్ల క్రితం చెప్పాను. అది సగం నెరవేరింది. మిగతా సగం ప్రజలే నెరవేర్చాలి.”
ఇలా పవన్ కల్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఎస్ జే సూర్య. “భారతీయుడు-2” సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాడు
పవన్ తో “ఖుషి” సినిమా తీసింది ఇతడే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో “కొమురం పులి” సినిమాను కూడా తెరకెక్కించాడు. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
జీవితంలో తను చూసిన అతికొద్దిమంది మంచి వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరని, ఎస్ జే సూర్య సందర్భం దొరికిన ప్రతిసారి చెబుతుంటాడు. ఈసారి కూడా అదే పని చేశాడు.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More