నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ఆసక్తికర ప్రకటన చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని తను గతంలోనే చెప్పానని, ఇప్పుడు అందులో సగం నెరవేరిందని అన్నాడు.
“దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరూ ‘భారతీయుడే’. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ సీఎం నా ఫ్రెండ్ అని ఒక రోజు గర్వంగా చెప్పుకుంటానని మూడేళ్ల క్రితం చెప్పాను. అది సగం నెరవేరింది. మిగతా సగం ప్రజలే నెరవేర్చాలి.”
ఇలా పవన్ కల్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఎస్ జే సూర్య. “భారతీయుడు-2” సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాడు
పవన్ తో “ఖుషి” సినిమా తీసింది ఇతడే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో “కొమురం పులి” సినిమాను కూడా తెరకెక్కించాడు. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
జీవితంలో తను చూసిన అతికొద్దిమంది మంచి వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరని, ఎస్ జే సూర్య సందర్భం దొరికిన ప్రతిసారి చెబుతుంటాడు. ఈసారి కూడా అదే పని చేశాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More