రవితేజ, శ్రీలల జంటగా నటించిన “ధమాకా” మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రవితేజ నటించిన సినిమా ఏదీ ఆడలేదు. అందుకే, రవితేజ ఆ సినిమాకి సీక్వెల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
“రవితేజ గారితో డబుల్ ధమాకా చేస్తే బావుంటుంది అనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. సీక్వెల్ ఐడియా దానికే కాదు ఇప్పుడు చేసిన “మజాకా”కి కూడా ఉంది. మజాకా చివర్లో డబుల్ మజాకా అని వేశాం. అయితే మరో టైటిల్ తో వెళ్ళాలా ఇదే టైటిల్ తో అన్నది తర్వాత డిసైడ్ చేస్తాం,” అని తెలిపారు త్రినాథరావు.
మరోవైపు, “మజాకా” సినిమాకి మలయాళ సినిమా “బ్రో డాడీ”కి పోలికలు ఉన్నాయి అనే వాదన ఉంది. కానీ అది తప్పు అంటున్నారు త్రినాధరావు.
“నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు. మజాకా కథని సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. వాళ్ళింట్లో ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే తపన పడే ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్ల గురించి ఈ సినిమా. ఈ సినిమా చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ముందు అంతా వినోదమే,”అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More