“హరిహర వీరమల్లు” సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ సినిమా సరిగ్గా 50 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ లేదు. మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. ఇది రెండు భాగాలుగా తీస్తున్నామని నిర్మాత ఏ.ఎం. రత్నం చెప్తున్నారు. రెండో భాగం తర్వాత సంగతి… మొదటి భాగం మొత్తానికి విడుదల కానుండడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ ఊపిరి పీల్చుకుంటోంది.
ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి, తాను కలకంటున్నట్లు పెద్ద హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందని భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమా కోసం ఈ భామ చాలా కష్టపడింది మరి. ఆమె ఈ సినిమా సెట్లో 2001లో చేరింది. అప్పటి నుంచి ఈ సినిమాకే అంకితం అయింది.
మధ్యలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “రాజాసాబ్” షూటింగ్ చేసింది కానీ “వీరమల్లు”కి ఏకంగా నాలుగేళ్లు డేట్స్ ఇచ్చింది మార్కి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హరిహర వీరమల్లు”లో సినిమాలో నిధి పంచమి అనే పాత్రలో ఆమె కనిపిస్తుంది.
50 రోజుల్లో ఈ అమ్మడి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుంది. ఇక ఆమె నటిస్తున్న మరో పెద్ద చిత్రం “ది రాజాసాబ్” ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More