ఏ సినిమాకైనా 45-50 కోట్లు ఎందుకు పెడతారు..? ధర్మ వడ్డీ లెక్కన చూసుకున్నా ఖర్చులు పోనూ కనీసం కోటి రూపాయలైనా మిగులుతుందని ఆశ. “మిస్టర్ బచ్చన్” విషయంలో నిర్మాతకు ఆ ఆశ లేకుండా పోయింది. డబుల్ డిజిట్ లో బడ్జెట్ పెడితే, సింగిల్ డిజిట్ లో కలెక్షన్లు వచ్చాయి.
రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది “మిస్టర్ బచ్చన్” సినిమా. అంతకుముందు రవితేజతో “ధమాకా” రూపంలో డబ్బులు సంపాదించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఈసారి అదే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు.
కట్ చేస్తే, సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మారింది.
ఈ సినిమాకు కేవలం 10 కోట్ల రూపాయల షేర్ (ప్రపంచవ్యాప్తంగా) మాత్రమే వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమాకూ ఇంత తక్కువ షేర్ రాలేదు.
సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ముందురోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ వేశారు. అదే పెద్ద దెబ్బ కొట్టింది. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో, మొదటి రోజుకే సినిమా డ్రాప్ అయింది. రెండో రోజుకు క్రాష్ అయింది. వారం తిరక్కముందే డిజాస్టర్ అనిపించుకుంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More