ఏ సినిమాకైనా 45-50 కోట్లు ఎందుకు పెడతారు..? ధర్మ వడ్డీ లెక్కన చూసుకున్నా ఖర్చులు పోనూ కనీసం కోటి రూపాయలైనా మిగులుతుందని ఆశ. “మిస్టర్ బచ్చన్” విషయంలో నిర్మాతకు ఆ ఆశ లేకుండా పోయింది. డబుల్ డిజిట్ లో బడ్జెట్ పెడితే, సింగిల్ డిజిట్ లో కలెక్షన్లు వచ్చాయి.
రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది “మిస్టర్ బచ్చన్” సినిమా. అంతకుముందు రవితేజతో “ధమాకా” రూపంలో డబ్బులు సంపాదించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఈసారి అదే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు.
కట్ చేస్తే, సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మారింది.
ఈ సినిమాకు కేవలం 10 కోట్ల రూపాయల షేర్ (ప్రపంచవ్యాప్తంగా) మాత్రమే వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమాకూ ఇంత తక్కువ షేర్ రాలేదు.
సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ముందురోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ వేశారు. అదే పెద్ద దెబ్బ కొట్టింది. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో, మొదటి రోజుకే సినిమా డ్రాప్ అయింది. రెండో రోజుకు క్రాష్ అయింది. వారం తిరక్కముందే డిజాస్టర్ అనిపించుకుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More