రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు.
ఆ పర్వత ప్రాంతంలోనే మహేష్, పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడీ సినిమాకు ఉన్న క్రేజ్ ను, మహేష్-రాజమౌళి పాపులారిటీని వాడుకోవాలని భావించింది ఒరిస్సా సర్కారు.
దేవ్ మాలి పర్వతం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం. దానికి మరింత గుర్తింపుని తీసుకొచ్చేందుకు మహేష్ బాబు సహకారాన్ని కోరింది ఒరిస్సా ప్రభుత్వం. స్వయంగా ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిద, లొకేషన్ కు వెళ్లి మహేష్ ను కలిశారు.
ఒరిస్సా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మహేష్ ముందుకొచ్చాడు. రాజమౌళితో కలిసి దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటాడు. దానికి మహేష్ మొక్క అని పేరుపెట్టారు. మహేష్ రాకతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారుతుందని, ఒరిస్సా భావిస్తోంది.
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More