రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు.
ఆ పర్వత ప్రాంతంలోనే మహేష్, పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడీ సినిమాకు ఉన్న క్రేజ్ ను, మహేష్-రాజమౌళి పాపులారిటీని వాడుకోవాలని భావించింది ఒరిస్సా సర్కారు.
దేవ్ మాలి పర్వతం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం. దానికి మరింత గుర్తింపుని తీసుకొచ్చేందుకు మహేష్ బాబు సహకారాన్ని కోరింది ఒరిస్సా ప్రభుత్వం. స్వయంగా ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిద, లొకేషన్ కు వెళ్లి మహేష్ ను కలిశారు.
ఒరిస్సా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మహేష్ ముందుకొచ్చాడు. రాజమౌళితో కలిసి దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటాడు. దానికి మహేష్ మొక్క అని పేరుపెట్టారు. మహేష్ రాకతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారుతుందని, ఒరిస్సా భావిస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More