‘L2 ఎంపురాన్’ సినిమా వివాదాస్పదమైన తర్వాత ఆ మూవీకి సంబంధించిన కీలక వ్యక్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మాత గోపాలన్ పై ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ.
ఇప్పుడు ‘L2 ఎంపురాన్’ దర్శకుడు ఫృధ్వీరాజ్ సుకుమారన్ వంతు వచ్చింది. ఇతడికి కూడా తాజాగా నోటీసులందాయి. గత 3 చిత్రాల ఆదాయపు వివరాలు ఇవ్వాలంటూ ఐటీ, ఇతడికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 లోపు ఈ నోటీసులకు స్పందించాల్సి ఉంది.
రీసెంట్ గా పృథ్వీరాజ్ 3 సినిమాల్లో నటించాడు. గోల్డ్, జనగణమన, కడువా చితాలవి. ఈ సినిమాలకు అతడు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సహ-నిర్మాతగా లాభాలు తీసుకున్నాడు. దీనిపై ఐటీ ఆరాలు తీస్తోంది.
సహ నిర్మాతగా పృథ్వీరాజ్ సంపాదన 40 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు కూడా ఆదాయపు పన్ను నోటీసులు రావడంతో, అంతా దీనికి ‘ఎంపురాన్’ వివాదంతో ముడిపెడుతున్నారు.
ఆ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు, అంశాన్ని ఎత్తుకోవడం వల్లనే కొంతమంది ఇలా దర్శకనిర్మాతలను టార్గెట్ చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More