‘L2 ఎంపురాన్’ సినిమా వివాదాస్పదమైన తర్వాత ఆ మూవీకి సంబంధించిన కీలక వ్యక్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మాత గోపాలన్ పై ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ.
ఇప్పుడు ‘L2 ఎంపురాన్’ దర్శకుడు ఫృధ్వీరాజ్ సుకుమారన్ వంతు వచ్చింది. ఇతడికి కూడా తాజాగా నోటీసులందాయి. గత 3 చిత్రాల ఆదాయపు వివరాలు ఇవ్వాలంటూ ఐటీ, ఇతడికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 లోపు ఈ నోటీసులకు స్పందించాల్సి ఉంది.
రీసెంట్ గా పృథ్వీరాజ్ 3 సినిమాల్లో నటించాడు. గోల్డ్, జనగణమన, కడువా చితాలవి. ఈ సినిమాలకు అతడు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సహ-నిర్మాతగా లాభాలు తీసుకున్నాడు. దీనిపై ఐటీ ఆరాలు తీస్తోంది.
సహ నిర్మాతగా పృథ్వీరాజ్ సంపాదన 40 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు కూడా ఆదాయపు పన్ను నోటీసులు రావడంతో, అంతా దీనికి ‘ఎంపురాన్’ వివాదంతో ముడిపెడుతున్నారు.
ఆ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు, అంశాన్ని ఎత్తుకోవడం వల్లనే కొంతమంది ఇలా దర్శకనిర్మాతలను టార్గెట్ చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More