“పోకిరి” సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ఇలియానా. ఒక ఏడేళ్లు తెలుగులో ఆమె హవా నడిచింది. ఆ తర్వాత ఆమెని తెలుగు ఫిలింమేకర్స్ పట్టించుకోవడం మానేశారు. ఐతే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తెలుగు కెరీర్ ఏడేళ్ల తర్వాత మందగించడానికి కారణం ఇది అంటూ ఒక వివరణ ఇచ్చింది.
ఇలియానా చెప్పిన కారణం చూస్తే ఆమె బాలీవుడ్ మీడియా ముందు అసలు విషయం దాచేస్తోంది అని చెప్పొచ్చు.
“నేను బర్ఫీ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ వెళ్ళాను. ఆ సినిమా హిట్ కావడంతో నాకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు దర్శక, నిర్మాతలు నన్ను పట్టించుకోలేదు. నేను తెలుగులో ఇక నటించను అని భావించారు వాళ్ళు,” అని తనకు తెలుగులో ఎందుకో క్రేజ్ పోయిందో చెప్పింది.
కానీ నిజం ఏంటంటే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టే టైంకే ఆమెకి ఇక్కడ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. “శక్తి”, “నేను నా రాక్షసి”, “దేవుడు చేసిన మనుషులు” వంటి దారుణమైన ఫ్లాపులు చూసింది ఆమె. ఆ టైంలో ఆడిన ఒకే ఒక్క మూవీ… జులాయి.
మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆమెకి తెలుగు దర్శక నిర్మాతలే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” దారుణంగా ఫ్లాప్ అయింది. అంతే అంతటితో ఆమె కేరీర్ కి ఎండ్ కార్డు పడింది తెలుగులో. ఇది అసలు విషయం. ఇలా చెప్పకుండా బాలీవుడ్ కి వెళ్లడం వల్ల తనని తెలుగు నిర్మాతలు పట్టించుకోలేదు అని చెప్తోంది.
ఇటీవలే ఈ భామ ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగా బిజీగా ఉంది. అమెరికాలో నివసిస్తోంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More