“పోకిరి” సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ఇలియానా. ఒక ఏడేళ్లు తెలుగులో ఆమె హవా నడిచింది. ఆ తర్వాత ఆమెని తెలుగు ఫిలింమేకర్స్ పట్టించుకోవడం మానేశారు. ఐతే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తెలుగు కెరీర్ ఏడేళ్ల తర్వాత మందగించడానికి కారణం ఇది అంటూ ఒక వివరణ ఇచ్చింది.
ఇలియానా చెప్పిన కారణం చూస్తే ఆమె బాలీవుడ్ మీడియా ముందు అసలు విషయం దాచేస్తోంది అని చెప్పొచ్చు.
“నేను బర్ఫీ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ వెళ్ళాను. ఆ సినిమా హిట్ కావడంతో నాకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు దర్శక, నిర్మాతలు నన్ను పట్టించుకోలేదు. నేను తెలుగులో ఇక నటించను అని భావించారు వాళ్ళు,” అని తనకు తెలుగులో ఎందుకో క్రేజ్ పోయిందో చెప్పింది.
కానీ నిజం ఏంటంటే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టే టైంకే ఆమెకి ఇక్కడ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. “శక్తి”, “నేను నా రాక్షసి”, “దేవుడు చేసిన మనుషులు” వంటి దారుణమైన ఫ్లాపులు చూసింది ఆమె. ఆ టైంలో ఆడిన ఒకే ఒక్క మూవీ… జులాయి.
మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆమెకి తెలుగు దర్శక నిర్మాతలే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” దారుణంగా ఫ్లాప్ అయింది. అంతే అంతటితో ఆమె కేరీర్ కి ఎండ్ కార్డు పడింది తెలుగులో. ఇది అసలు విషయం. ఇలా చెప్పకుండా బాలీవుడ్ కి వెళ్లడం వల్ల తనని తెలుగు నిర్మాతలు పట్టించుకోలేదు అని చెప్తోంది.
ఇటీవలే ఈ భామ ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగా బిజీగా ఉంది. అమెరికాలో నివసిస్తోంది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More