నిర్మాతగా మారి నిహారిక నిర్మించిన తొలి సినిమా “కమిటీ కుర్రాళ్లు”. ఈ సినిమా ప్రమోషన్ టైమ్ కు మెగా హీరోలెవ్వరూ అందుబాటులోకి రాలేదు. చిరంజీవి, రామ్ చరణ్ పారిస్ ఒలింపిక్స్ చూడ్డానికి వెళ్లారు. వదిన లావణ్య కాలిగాయంతో డెహ్రాడూన్ లో ఉంది. అన్నయ్య వరుణ్ తేజ్ వైజాగ్ లో షూటింగ్ లో బిజీ. చివరికి తండ్రి నాగబాబు కూడా దొరకడం లేదని బాధపడింది నిహా.
ఎట్టకేలకు ఆమెకు మద్దతుగా అందరూ తరలివచ్చారు. కమిటీ కుర్రాళ్లు ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.
“కమిటీ కుర్రాళ్లు” సినిమాను అందరికంటే ముందు, ప్రత్యేకంగా వీక్షించారట చిరు. సినిమా చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అయిందంటున్నారు చిరు.
సినిమా చూసిన తర్వాత సినిమాకు అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. మరి మెగాస్టార్ నమ్మకం నిజం అవుతుందా?
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More