న్యూస్

మేమిద్దరం ‘రత్నాల’మే: అంజలి

Published by

విశ్వక్ సేన్ తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు 31న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు.

నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అంజలి పాల్గొంది. సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాన్ని బయటపెట్టింది.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నాది, విశ్వక్ పాత్రల పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.”

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లో తనది ప్రత్యేక పాత్ర కాదంటోంది అంజలి. నేహా శెట్టి ఓ హీరోయిన్ గా నటిస్తే, తను మరో హీరోయిన్ గా చేశానని చెబుతోంది.

ALSO READ: I used cuss words in ‘Gangs of Godavari’: Anjali

Recent Posts

రష్మిక ముందే సిద్ధం అవుతోందా

రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More

June 28, 2025

శ్రద్ధ శ్రీనాథ్ కూడా అదే రూట్లోకి

గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More

June 28, 2025

విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్

మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More

June 28, 2025

ప్రభాస్ మేనియా పని చేస్తుందా?

'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More

June 26, 2025

బికినీ ఫోటోలకు ఇది టైమా?

సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More

June 26, 2025

శుక్రవారం నుంచి ‘సదానిర’

"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్‌ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More

June 26, 2025