విశ్వక్ సేన్ తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు 31న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు.
నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అంజలి పాల్గొంది. సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాన్ని బయటపెట్టింది.
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నాది, విశ్వక్ పాత్రల పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.”
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లో తనది ప్రత్యేక పాత్ర కాదంటోంది అంజలి. నేహా శెట్టి ఓ హీరోయిన్ గా నటిస్తే, తను మరో హీరోయిన్ గా చేశానని చెబుతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More