సీక్వెల్స్ పై దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సీక్వెల్స్ ఎలా తీస్తారో తనకు అస్సలు అర్థం కాదంటూ స్పందించాడు. తను ఎట్టిపరిస్థితుల్లో సీక్వెల్స్ చేయనని కూడా ప్రకటించాడు. దీంతో కృష్ణవంశీకి సీక్వెల్స్ అంటే ఇష్టంలేదని అర్థమైపోయింది.
అయినప్పటికీ ఈ దర్శకుడ్ని సీక్వెల్స్ పై ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజనం. తాజాగా “మురారి” సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా ఆ సినిమా సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది.
మహేష్ వీరాభిమాని ఒకరు కృష్ణవంశీని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. గౌతమ్ ఎలాగూ సినిమాల్లోకి వస్తాడు కాబట్టి, అతడ్ని హీరోగా పెట్టి “మురారి-2” తీయాలనేది అతడి అభ్యర్థన.
ఇదొక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కావడంతో కృష్ణవంశీ, గతంలోలా వెంటనే నో చెప్పలేకపోయాడు. అది తన పరిథిలో లేని అంశమని మాత్రమే స్పందించాడు. “మురారి” సీక్వెల్ పై మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి నిర్ణయం తీసుకోవాలని, అది తన చేతిలో లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.
నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More
మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More
సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More