సీక్వెల్స్ పై దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సీక్వెల్స్ ఎలా తీస్తారో తనకు అస్సలు అర్థం కాదంటూ స్పందించాడు. తను ఎట్టిపరిస్థితుల్లో సీక్వెల్స్ చేయనని కూడా ప్రకటించాడు. దీంతో కృష్ణవంశీకి సీక్వెల్స్ అంటే ఇష్టంలేదని అర్థమైపోయింది.
అయినప్పటికీ ఈ దర్శకుడ్ని సీక్వెల్స్ పై ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజనం. తాజాగా “మురారి” సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా ఆ సినిమా సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది.
మహేష్ వీరాభిమాని ఒకరు కృష్ణవంశీని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. గౌతమ్ ఎలాగూ సినిమాల్లోకి వస్తాడు కాబట్టి, అతడ్ని హీరోగా పెట్టి “మురారి-2” తీయాలనేది అతడి అభ్యర్థన.
ఇదొక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కావడంతో కృష్ణవంశీ, గతంలోలా వెంటనే నో చెప్పలేకపోయాడు. అది తన పరిథిలో లేని అంశమని మాత్రమే స్పందించాడు. “మురారి” సీక్వెల్ పై మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి నిర్ణయం తీసుకోవాలని, అది తన చేతిలో లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More