హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆదితి రావు ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. వనపర్తి సమీపంలోని శ్రీరంగపురంలోని శ్రీరంగనాయక దేవాలయంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ నిశ్చితార్థ వేడుక పెళ్లి వేడుకలా జరిగింది. దాంతో చాలామంది వారి పెళ్లి అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అది కేవలం ఎంగేజ్ మెంట్ అని.
ఇక ఇప్పుడు పెళ్లి ముహూర్తం గురించి స్పందించాడు హీరో సిద్ధార్థ్.
“మాది రహస్య వేడుక కాదు. మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ కి, సీక్రెట్ కి వేర్వేరు అర్థాలు. మాది సీక్రెట్ గా జరిగిన ఎంగేజ్ మెంట్ కాదు. మా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన వేడుక. ఇక పెళ్లి అంటారా ఆ తేదీని నిర్ణయించేది నేను కాదు, ఆదితి కాదు. మా పెద్దలు నిర్ణయిస్తారు. మంచి ముహూర్తం చూస్తున్నారు. సో, ముహూర్తం కుదిరినప్పుడు పెళ్లి జరుగుతుంది,” అని వివరణ ఇచ్చాడు.
“మహా సముద్రం” సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి డేటింగ్ మొదలుపెట్టి సహజీవనం ప్రారంభించారు. మూడేళ్ళ ప్రేమకు ఎంగేజ్మెంట్ తో పెళ్లి దారి దొరికింది. త్వరలోనే పెళ్లి.
ఆదితి రావు ఇంతకుముందు సత్యదేవ్ మిశ్రా అనే నటుడిని పెళ్లాడింది. కానీ కొన్నేళ్ళకు వాళ్ళు విడిపోయారు. ఇక సిద్ధార్థ్ కూడా తన మొదటి గాళ్ ఫ్రెండ్ ని పెళ్ళాడి, విడాకులు తీసుకున్నాడు.
ఆదితికి ఇప్పుడు 37 ఏళ్ళు. సిద్ధూకి 44 ఏళ్ళు. సో, ఇప్పుడు ఇద్దరూ కొత్త జీవనప్రయాణం పారంభిస్తున్నారు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More