హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆదితి రావు ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. వనపర్తి సమీపంలోని శ్రీరంగపురంలోని శ్రీరంగనాయక దేవాలయంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ నిశ్చితార్థ వేడుక పెళ్లి వేడుకలా జరిగింది. దాంతో చాలామంది వారి పెళ్లి అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అది కేవలం ఎంగేజ్ మెంట్ అని.
ఇక ఇప్పుడు పెళ్లి ముహూర్తం గురించి స్పందించాడు హీరో సిద్ధార్థ్.
“మాది రహస్య వేడుక కాదు. మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ కి, సీక్రెట్ కి వేర్వేరు అర్థాలు. మాది సీక్రెట్ గా జరిగిన ఎంగేజ్ మెంట్ కాదు. మా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన వేడుక. ఇక పెళ్లి అంటారా ఆ తేదీని నిర్ణయించేది నేను కాదు, ఆదితి కాదు. మా పెద్దలు నిర్ణయిస్తారు. మంచి ముహూర్తం చూస్తున్నారు. సో, ముహూర్తం కుదిరినప్పుడు పెళ్లి జరుగుతుంది,” అని వివరణ ఇచ్చాడు.
“మహా సముద్రం” సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి డేటింగ్ మొదలుపెట్టి సహజీవనం ప్రారంభించారు. మూడేళ్ళ ప్రేమకు ఎంగేజ్మెంట్ తో పెళ్లి దారి దొరికింది. త్వరలోనే పెళ్లి.
ఆదితి రావు ఇంతకుముందు సత్యదేవ్ మిశ్రా అనే నటుడిని పెళ్లాడింది. కానీ కొన్నేళ్ళకు వాళ్ళు విడిపోయారు. ఇక సిద్ధార్థ్ కూడా తన మొదటి గాళ్ ఫ్రెండ్ ని పెళ్ళాడి, విడాకులు తీసుకున్నాడు.
ఆదితికి ఇప్పుడు 37 ఏళ్ళు. సిద్ధూకి 44 ఏళ్ళు. సో, ఇప్పుడు ఇద్దరూ కొత్త జీవనప్రయాణం పారంభిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More