కియారా అద్వానీ తెలుగులో బాగా పాపులర్. బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులో ఆ హీరోతో రెండుసార్లు నటిస్తే రెండు సార్లూ అపజయమే చూసింది. అందుకే, కియారా, రామ్ చరణ్ కాంబినేషన్ కి యాంటీ సెంటిమెంట్ పడింది.
ఆమె మొదటిసారి తెలుగులో మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రంలో నటించింది. అది దారుణంగా అపజయం పాలైంది. బాగా ట్రోలింగ్ కి గురైంది. ఇక తాజాగా “గేమ్ చేంజర్”లో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయింది.
ఐతే, “గేమ్ చేంజర్” విషయంలో ఆమె ముందే మేల్కొంది. ఈ సినిమాలో తన పాత్రని కుదించారని ఆమె అలిగింది. అందుకే, సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. కేవలం హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం మినహా మరో ప్రమోషన్ చెయ్యలేదు. మొత్తానికి రామ్ చరణ్ తో నటించిన రెండు తెలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ జంటకి ఇకపై క్రేజ్ ఉండదు. వీరి కాంబినేషన్ లో ఇక సినిమా ఉండకపోవచ్చు.
కియారా ప్రస్తుతం “KGF” హీరో యష్ సరసన “టాక్సిక్” (Toxic) చిత్రంలో నటిస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More