కియారా అద్వానీ తెలుగులో బాగా పాపులర్. బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులో ఆ హీరోతో రెండుసార్లు నటిస్తే రెండు సార్లూ అపజయమే చూసింది. అందుకే, కియారా, రామ్ చరణ్ కాంబినేషన్ కి యాంటీ సెంటిమెంట్ పడింది.
ఆమె మొదటిసారి తెలుగులో మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రంలో నటించింది. అది దారుణంగా అపజయం పాలైంది. బాగా ట్రోలింగ్ కి గురైంది. ఇక తాజాగా “గేమ్ చేంజర్”లో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయింది.
ఐతే, “గేమ్ చేంజర్” విషయంలో ఆమె ముందే మేల్కొంది. ఈ సినిమాలో తన పాత్రని కుదించారని ఆమె అలిగింది. అందుకే, సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. కేవలం హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం మినహా మరో ప్రమోషన్ చెయ్యలేదు. మొత్తానికి రామ్ చరణ్ తో నటించిన రెండు తెలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ జంటకి ఇకపై క్రేజ్ ఉండదు. వీరి కాంబినేషన్ లో ఇక సినిమా ఉండకపోవచ్చు.
కియారా ప్రస్తుతం “KGF” హీరో యష్ సరసన “టాక్సిక్” (Toxic) చిత్రంలో నటిస్తోంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More